తేజ్ ఐ లవ్ యు చిత్రానికి సంభందించిన ప్రమెషన్ లో భాగంగా విశాఖపట్నం నుండి హైదరాబాద్ కి తిరుగుప్రయాణం లో విమానాశ్రమం వద్దకు చేరుకున్నారు సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్.. ఇంతలోనే ఓ పిలుపు అతన్ని పలకరించింది. పాండ్రంగి గ్రామానికి చెందిన బంగారమ్మ అనే యువతి బోన్ కేన్సర్ తో భాదపడుతుంది. డాక్టర్ ట్రీట్మెంట్ లో భాగంగా ఓ లెగ్ ని తీసివేశారు. ఇటీవల 10 వ తరగతి లో 8.5 గ్రేడ్ ని సాధించింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న పెందుర్తి గ్రామానికి చెందిన రాము అనే యువకుడు ఆమెకి ఆసరాగా నిలబడ్డాడు. అయితే తన అభిమాన హీరో సాయిధరమ్ తేజ్ సిటి కి రావటంతో తెలుసుకున్న బంగారమ్మ తన అభిమాన హీరోని కలవానుకుంది.. ఈ విషయం తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ తన అభిమానులచే తనని విమానాశ్రమం దగ్గరకి పిలిపించి కలిసారు.. అంతేకాకుండా తన ఆరోగ్యం ఎలా వుందని అడిగి తెసుసుకున్నాడు. తనకి ఇంతలా సహయ పడుతున్న రాము ని కూడా అభినందించాడు.. బంగారమ్మ ఆరోగ్యం బాగా కుదుటపడాలని మెగా అభిమానులందరూ ప్రార్ధన చేయాలని అంతే కాదు ఈ విషయం తెలుసుకున్నవారంతా తన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని మనస్పూర్తిగా సాయిధరమ్ తేజ్ కోరారు..